Stock Market: నష్టాలు లెక్కేసుకుంటున్న మార్కెట్లు..! 14 d ago
8K News-19/02/2026 భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ పతనంతో ముగిశాయి. సెన్సెక్స్ 1236.11 పాయింట్లు (1.48%) పడిపోయి 82,498.14 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 365 పాయింట్లు (1.41%) నష్టపోయి 25,454.35 వద్ద స్థిరపడింది. మొత్తం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో 2,235 షేర్లు నష్టాల్లో ముగియగా కేవలం 687 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ముఖ్యంగా మెటల్, ఆయిల్ రంగాలు భారీగా పడిపోగా, మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సూచీలు కూడా సుమారు 2% చొప్పున నష్టాలను చవిచూశాయి.